శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు... ఎప్పుడంటే....

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు... ఎప్పుడంటే....

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Srivari Salakatla Teppotsavams) మార్చి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపింది.

  • తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
  • రెండవ రోజు మార్చి 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
  • మూడవరోజు మార్చి 22న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు.
  •  శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 23న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 24వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
  • తెప్పోత్సవాల(Srivari Salakatla Teppotsavams 2024) కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.